యూపీఐ పేమెంట్లకు ఈఎంఐ ఆప్షన్

యూపీఐ పేమెంట్లకు ఈఎంఐ ఆప్షన్

ముంబై: క్యూఆర్​ కోడ్స్​ స్కాన్​చేయడం ద్వారా యూపీఐ పేమెంట్లు చేసే కస్టమర్లకు సైతం ఈఎంఐ ఫెసిలిటీని ఐసీఐసీఐ బ్యాంక్​ అందుబాటులోకి తెచ్చింది. తమ  బ్యాంక్​ పే లేటర్ ఎలిజిబిలిటీ ఉన్న కస్టమర్లందరికీ ఈ ఆప్షన్​ అందుబాటులో ఉంటుందని ​ఐసీఐసీఐ వెల్లడించింది. ట్రాన్సాక్షన్​ ఎమౌంట్​ రూ. 10 వేల కంటే ఎక్కువ వుంటేనే ఈఎంఐ ఆప్షన్​ ఉంటుందని పేర్కొంది.  మూడు, ఆరు, తొమ్మిది నెలల కాలానికి ఈ ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయని వివరించింది. ఎలక్ట్రానిక్స్​ఐటమ్స్, గ్రోసరీస్​, అపారెల్​ వంటి కొనుగోళ్లకు ఈఎంఐ ఆప్షన్​ వాడుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్​ తెలిపింది. ఈ పే లేటర్​ ఫెసిలిటీ కింద నెలవారీగా  చెల్లించాల్సిన ఎమౌంట్​ను సేవింగ్స్​ అకౌంట్​ నుంచి ఆటోమేటిక్​గా బ్యాంకు డెబిట్​ చేస్తుంది. పే లేటర్​ ఫెసిలిటీని ఐసీఐసీఐ బ్యాంక్​ 2018 లోనే లాంఛ్​ చేసింది. ప్రీ అప్రూవ్డ్​ ఆఫర్లున్న కొంత మంది కస్టమర్లకు ఈ పే లేటర్​ కూడా 
అందుబాటులో ఉంటుంది.