అమరావతి: ఏపీ సర్కారు తెచ్చిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ‘చలో విజయవాడ’కు ఉద్యోగులు, టీచర్లు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా కిలోమీటర్ల మేర ఎటు చూసినా వాళ్లే కనిపించారు. దీంతో ‘చలో విజయవాడ’ సక్సెస్ అయ్యిందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కార్యక్రమానికి బయలుదేరిన వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు, టీచర్లు తరలివచ్చి గురువారం భారీ ప్రదర్శన చేశారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ ఎన్జీవో భవన్ నుంచి అలంకార్ థియేటర్, బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా ర్యాలీ చేశారు. రాష్ట్ర సర్కారు పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే మరింతగా తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలను రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సమ్మె విరమించుకుని, చర్చలకు రావాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఐఆర్ పెంచామని తెలిపారు. కాగా, చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయ్యిందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలా? వద్దా అనే విషయాన్ని శుక్రవారం జరిగే స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగుల డిమాండ్లను సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
చలో విజయవాడకు భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, టీచర్లు
- ఆంధ్రప్రదేశ్
- February 4, 2022
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పశ్చిమ కనుమల్లోని తెన్ కాశిలో వీర ధీర శూరన్ షూటింగ్
- జైదీప్, సుజీత్కు నిరాశ
- వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024
- కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ, కార్లు ధ్వంసం
- బుక్ రివ్యూ: తెలంగాణ సంపూర్ణ చరిత్ర
- ఢిల్లీ ఢమాల్..47 రన్స్తో క్యాపిటల్స్పై ఆర్సీబీ సూపర్ విక్టరీ
- ఇషాకు రెండో విజయం
- ప్రజ్ఞానందకు నాలుగు, అర్జున్కు ఐదో స్థానం
- చైనా దిగుమతులే దిక్కు..2023-24 లో 101.7 బిలియన్ డాలర్లకు ఇంపోర్ట్స్
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- టీ20లో రికార్డు సృష్టించిన సునీల్ నరైన్..