వాషింగ్టన్: భారత ప్రధానిగా నరేంద్రమోడీ తిరిగి ఎన్నికైన తర్వాత రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంపై అమెరికా స్పందించింది. దక్షిణాసియాలో శాంతి కొనసాగాలంటే ఆ బాధ్యత పాక్పైనే ఉందని, టెర్రర్ గ్రూపులను పాకిస్థాన్ దూరం పెడితేనే అది సాధ్యమవుతుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. కాశ్మీర్ సహా అన్ని అంశాలనూ చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్.. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీకి రెండు లేఖలు రాశారు. చర్చలకు ముందుకు వస్తే ఇరు దేశాల్లో పేదరికాన్ని పారద్రోలడంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి కలసి పనిచేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అయితే పాక్ ఆఫర్ను ఇండియా తిరస్కరించింది. టెర్రరిస్టులు, చర్చలు ఒకేసారి కొనసాగలేవని, కిర్గిస్థాన్లో ఈ నెల 13–14 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్ సమ్మిట్(ఎస్ సీవో)లోనూ రెండు దేశ ప్రధానుల సమావేశం ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు టెర్రరిస్టులను అరెస్ట్ చేసి, వారిని ప్రాసిక్యూట్ చేయాలని, దేశంలో స్వేచ్ఛగా తిరిగేందుకు, కార్యకలాపాలు నిర్వహించేందుకు వారికి అనుమతి ఇవ్వొద్దని, ఆయుధాలతో భారత్లో చొరబడి దాడులకు పాల్పడటాన్ని అడ్డుకోవాలని వైట్హౌస్లోని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు కళ్లెం వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, టెర్రరిస్టు సంస్థలు కార్యకలాపాలు నిర్వహించినంత కాలం.. ఇండియా–-పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొనడం అసాధ్యమని చెప్పారు. అందువల్ల శాంతిని కొనసాగించాల్సిన బాధ్యత పాక్పైనే ఉందని, అందువల్ల టెర్రర్ సంస్థలను నేలమట్టం చేస్తామని నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఆ దేశంపైనే ఉందని తెలిపారు.
టెర్రర్ గ్రూపుల పనిపట్టండి..పాక్కు అమెరికా సలహా
- విదేశం
- June 9, 2019
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- జనగామలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత
- పెద్దపల్లి పార్లమెంట్ లో 11 గంటల్లోపు 26.33 శాతం పోలింగ్
- తెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్
- పలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్.. ఓట్లు వేయమంటున్న గ్రామస్తులు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
- జైపూర్లో ఆరు స్కూల్స్కు బాంబు బెదిరింపులు
- బతికుండగానే చనిపోయారని హిందువుల ఓట్లు తీసేశారు: మాధావిలత
- కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..