ఐపీఎల్​ ఆఫర్స్​పై ఇంకా చర్చించలేదు​

ఐపీఎల్​ ఆఫర్స్​పై ఇంకా చర్చించలేదు​

న్యూఢిల్లీ: ఐపీఎల్​ ఫేజ్​–2 నిర్వహణ కోసం వచ్చిన ఆఫర్లపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని బీసీసీఐ ట్రెజరర్​ అరుణ్​ సింగ్​ ధూమల్​ వెల్లడించారు.  ‘అన్ని ఆప్షన్స్​ను మేం పరిశీలిస్తాం. కానీ ఇప్పుడు కాదు. సరైన టైమ్​లో దానిపై సరైన నిర్ణయం తీసుకుంటాం. మిగతా మ్యాచ్​లను కంప్లీట్​ చేసేందుకు ఎలాంటి చర్యలు అవసరమో చూస్తున్నాం. ఇంగ్లండ్​ కౌంటీలు ఇచ్చిన ఆఫర్స్​పై కూడా ఎలాంటి చర్చ జరగలేదు. ఇప్పుడు చర్చించడం తొందరపాటు అవుతుంది. ఏదేమైనా ఐపీఎల్​కు క్రేజ్​ ఏమాత్రం తగ్గలేదని తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు మ్యాచ్​లు కావాలని కోరుకుంటున్నారు. ఇండియా అవతల కూడా ఐపీఎల్​​కు భారీ ఫాలోయింగ్​ వచ్చింది’ అని ధూమల్​ ​ పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే తమ దృష్టంతా టీ20 వరల్డ్​కప్​పైనే ఉందన్నారు. మెగా ఈవెంట్​ ప్రిపరేషన్స్​ను ఫైనలైజ్​ చేయడమే తమ టార్గెట్​ అని చెప్పారు.