
హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఈనెల 28న నిర్వహించనున్న వార్డు సభలకు అవసరమైన టీమ్లు ఏర్పాటు చేయాలని ఎంఏయూడీ ప్రిన్సిపల్సెక్రటరీ దానకిశోర్అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రంలోని మున్సిపల్కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో ప్రజాపాలన సన్నద్ధతపై సీడీఎంఏ ఆఫీస్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రజాపాలన సభలు ప్రారంభం కావడానికి రెండు రోజులే వ్యవధి ఉందని, ఈ లోగా అన్ని వార్డుల టీమ్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, వాటికి రశీదులు ఇవ్వడం, ఆయా అప్లికేషన్లను కంప్యూటరైజ్చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఏయే వార్డుల్లో ఏ రోజు సభ ఉంటుందనే దానిపైనా విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు.
వార్డు సభల్లో ఆయా వార్డులకు చెందిన ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, ముందుగానే వారికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంపై ప్రతి రోజు స్టేట్హెడ్క్వార్టర్స్కు నివేదికలు పంపాలని సూచించారు. సమావేశంలో సీడీఎంఏ దాసరి హరిచందన, జేడీలు కృష్ణమోహన్రెడ్డి, శ్రీధర్తదితరులు పాల్గొన్నారు.