ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో డిసెంబర్ 16న రాత్రి డంపర్ ట్రక్కు ధాబాలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన ఇక్డిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్పూర్ మోడ్లో జరిగింది. ఒక డంపర్ ట్రక్కు ధాబాలోకి దూసుకెళ్లిందని, ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని ఇటావా డీఎం అవ్నీష్ రాయ్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు.
ఎటావా జాతీయ రహదారి-2పై ఎక్డిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి, కాన్పూర్ నుండి వస్తున్న అదుపుతప్పిన ట్రక్కు (ట్రాలీ) రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్, గుడిసెలోకి దూసుకెళ్లింది. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే, జిల్లా మేజిస్ట్రేట్ అవ్నీష్ రాయ్, ఇటావా SSP సంజయ్ కుమార్ వర్మతో పాటు అనేక పోలీసు స్టేషన్ల పోలీసులు, SDM సదర్ సహా మొత్తం పరిపాలనా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చాలా సమయం తర్వాత, ప్రమాదానికి గురైన ట్రక్కును క్రేన్ సహాయంతో తొలగించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ఎస్ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో మృతులను ఇంకా గుర్తించలేదు.
#WATCH | 3 dead and 3 injured after a dumper truck rammed into a Dhaba in Etawah, Uttar Pradesh (16/12) pic.twitter.com/kzAuQUIwwn
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 16, 2023