రిపబ్లిక్ డే చీఫ్ గెస్టులుగా..ఈయూ కమిషన్, కౌన్సిల్ చీఫ్లు

రిపబ్లిక్ డే చీఫ్ గెస్టులుగా..ఈయూ కమిషన్, కౌన్సిల్ చీఫ్లు

న్యూఢిల్లీ: 2026 ఏడాది ఢిల్లీలో జరగనున్న జనవరి 26 వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా చీఫ్ గెస్టులుగా వచ్చే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి. 

అలాగే, ఆ సమయంలోనే ఢిల్లీలో భారత్–ఈయూ శిఖరాగ్ర సమావేశం కూడా జరగనుంది. ఈ సమిట్​లో ఇరు పక్షాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్​టీఏ) కుదుర్చుకునే అవకాశం ఉందని  కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగ్రవాల్ ఇదివరకే వెల్లడించారు.