సంజీవయ్య  ఆశయ సాధనకు అందరూ పనిచేయాలి

 సంజీవయ్య  ఆశయ సాధనకు అందరూ పనిచేయాలి

మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు రిటైర్డ్ ఐఏఎస్, దామోదరం సంజీవయ్య ఫౌండేషన్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు. కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలన్నారు. పెదపాడులో సంజీవయ్య స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లో దామోదరం సంజీవయ్య ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. సంజీవయ్య ఆశయ సాధనకు అందరూ పనిచేయాలన్నారు దాసరి శ్రీనివాసులు. వచ్చే నెల 14న సంజీవయ్య శత జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.