
కళ్యాణ్ జువెలర్స్ ఇండియా ఛైర్మన్ గా మాజీ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ నియమితులయ్యారు. అలాగే ఆయన బోర్డులో ఎనిమిదో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానూ వ్యవహరించనున్నారు.. అయితే టీఎస్ కళ్యాణ రామన్ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ బోర్డులో ఇప్పటికే ఏడుగురు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారు. ఉన్నత విలువలతో వ్యాపారం చేస్తున్న కళ్యాణ్ జువెలర్స్ ఛైర్మన్ గా నియమితులవడం సంతోషం వ్యక్తం చేశారు. అనుభవం ఉన్న వినోద్ రాయ్ సేవలను వినియోగించుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని ఎండీ కళ్యాణ రామన్ తెలిపారు.
బోర్డులో మాజీ షాపర్స్ స్టాప్ సీఈఓ సలీల్ నాయర్, ఎల్ అండ్ కే సాచి , సాచ్చి ఇండియా మాజీ సీఈఓ అనిల్ నాయర్, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ కిషోరి ఉదేశి, వార్బర్గ్ పింకస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అనీష్ సరాఫ్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ మాజీ చైర్మన్ టీఎస్ అనంతరామన్ ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ మాజీ ఎండీ మహాలింగం రామస్వామి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ ఈడీ అగ్నిహోత్ర దక్షిణ మూర్తి చావలి సభ్యులుగా ఉన్నారు.