టీఎంసీలోకి మేఘాలయ మాజీ సీఎం

టీఎంసీలోకి మేఘాలయ మాజీ సీఎం

షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు గురువారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా.. 12 మంది టీఎంసీలో చేరుతున్నారు. దీంతో మేఘాలయ ఎన్నికల్లో పోటీ చేయకుండానే టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా మారనుంది. దాదాపు మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు.

మేఘాలయ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చీఫ్ గా విన్సెంట్ హెచ్.పాలాను నియమించిన తర్వాత సంగ్మా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని సంగ్మా కలిశారు. దీంతో ఆయన టీఎంసీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన ఏకంగా మరో 12 మంది ఎమ్మెల్యేలతో కలసి తృణమూల్ తీర్థం పుచ్చుకోవడం కాంగ్రెస్ ను తీవ్రంగా దెబ్బతీసిందనే చెప్పాలి.