బూటకపు ఎన్​కౌంటర్​ కేసు.. మాజీ పోలీసుకు జైలు శిక్షబాంబే హైకోర్టు తీర్పు

బూటకపు ఎన్​కౌంటర్​ కేసు.. మాజీ పోలీసుకు జైలు శిక్షబాంబే హైకోర్టు తీర్పు

ముంబై: బూటకపు ఎన్​కౌంటర్ కేసులో మాజీ పోలీసు ప్రదీప్ శర్మ కు మంగళవారం బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది. శర్మ నిర్దోషన్న ట్రయల్ కోర్టు తీర్పును జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ గౌరీ గాడ్సేల డివిజన్ బెంచ్ రద్దు చేసింది.

సెషన్స్ కోర్టులో మూడు వారాల్లో లొంగిపోవాలని శర్మను ఆదేశించింది. చోటా రాజన్ సన్నిహితుడు రామ్ నారాయణ్ గుప్తాను 2006 లో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ కేసులో పోలీసులతో పాటు మొత్తం 22 మందిని సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. ప్రదీప్​ శర్మను విడుదల చేసింది. దీనిపై బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా తీర్పు వెలువరించింది.