టెర్రరిస్టులు, ఆర్మీ జవాన్ల మధ్య కొనసాగుతున్న ఫైరింగ్

టెర్రరిస్టులు, ఆర్మీ జవాన్ల మధ్య కొనసాగుతున్న ఫైరింగ్

జమ్మూ కశ్మీర్ లో టెర్రరిస్టులు, ఆర్మీ జవాన్లకు మధ్య ఫైరింగ్ కొనసాగుతోంది. ద్రగద్ సుగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సెర్చింగ్ మొదలు పెట్టారు జవాన్లు. అయితే టెర్రరిస్టులు ఫైరింగ్ మొదలు పెట్టడంతో ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో  ఇద్దరు టెర్రరిస్టులను మట్టుపెట్టారు జవాన్లు. అయితే మరికొంత మంది దుండగులు దాగి ఉండొచ్చనే అనుమానంతో భద్రతా సిబ్బంది అపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు అధికారులు.