అమీన్పూర్లో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ..ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

అమీన్పూర్లో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ..ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

అమీన్​పూర్, వెలుగు: అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో నూతన ఎక్సైజ్ సర్కిల్​స్టేషన్​ను ఎంపీ రఘునందన్​రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి కలిసి సోమవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో డ్రగ్స్, హెరాయిన్​, కొకైన్, గంజాయి, ఇతర మత్తు పదార్ధాలకు అడ్డాగా మారిందన్నారు.

  డ్రగ్స్​ను అరికట్టి  యువత అటు వైపు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సుధాకర్​రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానంద్​, మున్సిపల్​ మాజీ వైస్​ చైర్మన్​ నర్సింహాగౌడ్​, ఎక్సైజ్​ డిప్యూటీ సూపరింటెండెంట్​ హరికిషన్, జిల్లా ఎక్సైజ్​అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్​ ఎక్సైజ్​సూపరింటెండెంట్​ మణెమ్మ, సీఐ పరమేశ్వర్​గౌడ్​, ఎస్​ఐలు అనంత్​రెడ్డి, రాములు పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ

సిద్దిపేట(తొగుట): తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులను సోమవారం ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తుక్కాపూర్ గ్రామ అభివృద్ధికి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులతో అభివృద్ధికి కృషి చేశానని, ఎంపీగా ఇప్పుడు తోడ్పాటునందిస్తానన్నారు. పీఎం హార్ ఘర్ సూర్య యోజన ద్వారా ప్రతీ గ్రామస్తుడు ఇంటిపై సోలార్ పానెల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

పథకానికి  కేంద్రం రూ.70 వేల వరకు సబ్సిడీ అందిస్తోందని, సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.