వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో వెలువడనున్నాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్, జోబైడెన్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. 270 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంటే విజయం సాధించినట్లే. ప్రస్తుతం ట్రంప్పై బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బైడెన్ 224 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ట్రంప్ 213 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. దీంతో ఓట్ల లెక్కింపు పూర్తి కాని చోట్ల ఉత్కంఠత నెలకొంది. గెలుపుపై బైడెన్, ట్రంప్ ఇద్దరూ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
We feel good about where we are. We believe we are on track to win this election.
— Joe Biden (@JoeBiden) November 4, 2020
‘మా ఆధిక్యంపై సంతోషంగా ఉన్నాం. ఈ ఎన్నికల్లో గెలుపు దిశగా సరైన ట్రాక్పై ఉన్నామని నమ్ముతున్నాం’ అని బైడెన్ ట్వీట్ చేశారు.
I will be making a statement tonight. A big WIN!
— Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020
‘ఈ రోజు రాత్రి నేను పెద్ద స్టేట్మెంట్ ఇవ్వబోతున్నా. నాదే భారీ గెలుపు!’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.