స్టీలు, ఐరన్ ఓర్పై ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గింపు
ఎగుమతులు పెంచేందుకే..
న్యూఢిల్లీ: స్టీల్ ప్రొడక్ట్స్, ఐరన్ ఓర్పై ఎగుమతి డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దేశీయంగా ఉక్కు పరిశ్రమకు బూస్ట్ ఇవ్వడంతోపాటు, ఎగుమతులు పెంచుకోవడానికీ ఈ నిర్ణయం వీలు కలిగిస్తుంది. మరోవైపు ఆంధ్రసైట్, కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్లపై ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం పెంచింది. ఈ మూడింటినీ స్టీల్ ఇండస్ట్రీ రా మెటీరియల్స్గా వాడుతుంది. ఈ మేరకు ఫైనాన్స్ మినిస్ట్రీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరు నెలల గ్యాప్ తర్వాత ఎక్స్పోర్ట్ డ్యూటీ కన్సెషన్స్ను, ఇంపోర్ట్ ట్యాక్స్నూ రిస్టోర్ చేశారు. శనివారం నుంచి స్పెసిఫైడ్ పిగ్ ఐరన్, స్టీల్ ప్రొడక్టులతోపాటు, ఐరన్ ఓర్ పెల్లెట్స్పై నిల్ డ్యూటీ ఉంటుందని ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ నోటిఫికేషన్ వెల్లడించింది. 58 శాతం లోపు ఐరన్ కంటెంట్ ఉండే ఐరన్ ఓర్ లంప్స్, ఫైన్స్పైనా డ్యూటీ ఉండదని పేర్కొంది. 58 శాతానికి మించి ఐరన్ కంటెంట్ ఉండే లంప్స్, ఫైన్స్పై మాత్రం 30 శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీ ఉంటుందని వివరించింది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో స్టీల్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సిందియా మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రాతో పాటు, ఇతర అధికారులూ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ డ్యూటీల తగ్గింపు కోసం స్టీల్ ఇండస్ట్రీ గత కొన్ని నెలలుగా పట్టుపడుతోంది. తాజా నిర్ణయం దేశీయ స్టీల్ ఇండస్ట్రీకి మేలు చేస్తుందని, ఎగుమతులు పెరుగుతాయని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఈ నిర్ణయంపై స్టీల్ ఇండస్ట్రీ సంతోషం వ్యక్తం చేసింది.