నకిలీ ఓవర్సీస్​ రిక్రూట్​మెంట్ ​ ఏజెన్సీలతో జాగ్రత్త .. ఉద్యోగార్థులకు విదేశాంగ శాఖ హెచ్చరిక

నకిలీ ఓవర్సీస్​ రిక్రూట్​మెంట్ ​ ఏజెన్సీలతో జాగ్రత్త .. ఉద్యోగార్థులకు విదేశాంగ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రిజిస్టర్​కానీ రిక్రూట్​మెంట్ ఏజెన్సీల ద్వారా వెలువడే నకిలీ జాబ్​ఆఫర్లతో  మోసపోతున్నవారి సంఖ్య పెరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.  ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండానే కొన్ని ఏజెన్సీలు  ఉద్యోగార్థుల వద్ద రూ. 2 నుంచి 5 లక్షల దాకా అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. ఈ నకిలీ ఏజెన్సీలకు చెందినవారు ఫేస్​బుక్​, వాట్సప్ ఇతర మాధ్యమాల​ ద్వారా మెసెజెస్, కాల్స్​ చేస్తారని.. అందువల్ల కాలర్​ వివరాలను, జాబ్​ డీటేయిల్స్​ కనుక్కోవడం కష్టంగా మారిందని వివరించింది. 

రెగ్యూలర్​ గా నకిలీ జాబ్ ఆఫర్లతో  ఆకర్షిస్తారని, ప్రమాదకర ఉద్యోగాల్లో జాయిన్​ చేయిస్తారని చెప్పింది. ఈస్ట్​ యూరోపియన్​కంట్రీస్​, గల్ఫ్​ కంట్రీస్, సెంట్రల్​ ఏషియన్​ కంట్రీస్​, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్​ తదితర దేశాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. లైసెన్స్​ పొందిన ఓవర్సీస్​ రిక్రూట్​మెంట్​ ఏజెన్సీల ద్వారానే విదేశాలకు వెళ్లాలని  ఉద్యోగార్థులకు సూచించింది. లైసెన్సుడ్​ ఏజెన్సీలలో ఇమ్మిగ్రేషన్​ యాక్ట్ 1983 ప్రకారం.. 30 వేలు, 18 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తారని తెలిపింది. చెల్లించిన దానికి రిసీప్ట్​ కూడా ఇస్తారని వివరించింది.  అనుమతిలేని రిక్రూట్​మెంట్​ ఏజెన్సీలను వదలబోమని ప్రభుత్వం హెచ్చరించింది.