న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఓ మహిళా పైలట్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విమానం బయల్దేరడానికి ముందు చేపట్టిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఫెయిల్అవడంతో ఆ పైలట్ ను మూడు నెలలు సస్పెండ్ చేసినట్టు మంగళవారం ఎయిర్ ఇండియా ఆఫీసర్ ఒకరు తెలిపారు. బోయింగ్ 787 విమానానికి ఫస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఓ మహిళా పైలట్, గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానంలో ప్రీ-ఫ్లైట్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఫెయిల్అయ్యారు.
దీంతో సంస్థ ఆమెపై చర్యలు చేపట్టింది. సస్పెండ్ అయిన లేడీ పైలట్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అని సమాచారం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్రూల్స్ ప్రకారం, ఫ్లైట్సిబ్బంది తప్పనిసరిగా ఫ్లైట్ డ్యూటీ బయలుదేరే విమానాశ్రయంలో ప్రీ-ఫ్లైట్ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ టెస్ట్లో ఫెయిల్ అయితే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇలాంటివి రిపీట్అయితే సివియర్ యాక్షన్ తీసుకుంటారు. విమాన ప్రయాణానికి ముందు, తరువాత టెస్ట్లకు ఇది వర్తిస్తుంది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మొదటిసారి విఫలమైన పైలట్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు.