
కన్జర్వేటివ్ యాక్టివిస్ట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో FBI కీలక విషయాలు వెల్లడించింది. కిర్క్ ను కాల్చిచంపింది కాలేజీ కుర్రాడి వయస్సున్న వ్యక్తి ..హత్యకు అడ్వాన్స్డ్ రైఫిల్ వినియోగించినట్లు తెలిపింది.ఆ వెపన్ అధిక శక్తితో కూడిన బోల్ట్-యాక్షన్ రైఫిల్ అని FBI గుర్తించింది. నిందితుడి ఫొటోలు లభ్యమయినట్లు ఎఫ్ బీఐ అధికారులు చెప్పారు.
చార్లీ కిర్క్ హత్యకు ఉపయోగించిన రైఫిల్కు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కాల్పుల అనంతరం నిందితుడు పారిపోయిన ప్రాంతంలో ఓ టవల్ లో చుట్టి ఉన్న మౌజర్.30 క్యాలిబర్ బోల్ట్-యాక్షన్ రైఫిల్"ను FBI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రైఫిల్ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఫెడరల్ ల్యాబ్కు పంపించారు. నిందితుడికి ఆయుధం ఎలా వచ్చింది అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఉటా యూనివర్సిటీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 31 ఏళ్ల చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు.కిర్క్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,ఉపాధ్యక్షుడు JD వాన్స్ కిర్క్కు నివాళులర్పించారు. యువరాజకీయ నేతగా, స్నేహితుడిగా అని కిర్క్ నుకొనియాడారు.
గొప్ప వ్యక్తి, లెజండరీ చార్లీ కిర్క్ ఇక లేరు అని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో రాశారు. అమెరికన్ యువతను చార్లీ అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ చేసుకోలేదు, ప్రేమించలేదని ట్రంప్ అన్నారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు. కాల్పులకు సంబంధించి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని విచారణ అనంతరం విడుదల చేసినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు.