దొంగ ఫిర్యాదులు పుట్టించి పోలీసులను వాడుకుంటున్నారు

దొంగ ఫిర్యాదులు పుట్టించి పోలీసులను వాడుకుంటున్నారు
  • శివాజీ విగ్రహావిష్కరణకి అనుమతి నిరాకరణపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం
  • నన్ను భౌతికంగా ఆపగలరేమో.. బీజేపీ ఎదుగుదలను ఆపడం కేసీఆర్ తరం కాదు

నిజామాబాద్: తెలంగాణలో బీజేపీ ఎదుగుతోందని కేసీఆర్కు వణుకుపుడుతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. దర్పల్లి, మోపాల్ మండల కేంద్రాల్లో శివాజీ విగ్రహావిష్కరణకి పోలీసులు అనుమతి నిరాకరణపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం దర్పల్లి, మోపాల్ మండల కేంద్రాల్లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతోపాటు.. నిన్న రాత్రి నుంచే బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుండే పలువురు బీజేపీ కార్యకర్తలకు ఫోన్లలో బెదిరింపులకు పాల్పడ్డారు. మరో వైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
విగ్రహావిష్కరణకు అనుమతి లేదంటున్న పోలీసుల తీరుపై ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. హిందుత్వం, భారతీయ జనతా పార్టీ నా ప్రాంతంలో పెరుగుతుందని కేసీఆర్ కి వణుకు పుడుతున్నదని, నన్ను భౌతికంగా ఆపగలరేమో.. బీజేపీ ఎదుగుదలను ఆపడం కేసీఆర్ తరం కాదన్నారు. కేసీఆర్  పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నడని ఆరోపించారు. ఇందూర్ లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపడానికి  ప్రత్యేకంగా పోలీస్ అధికారులను నియమించుకున్నారని విమర్శించారు. హిందుత్వం ఉప్పెనలా వస్తది, హిందూ వ్యతిరేకులంతా కొట్టుకుపోవడం ఖాయం అన్నారు. నెలల నుండి కడుతున్నటువంటి విగ్రహానికి , ఇప్పుడు ఫిర్యాదు చేసుడేంది? దొంగ కంప్లైంట్లు పుట్టించి పోలీసులను వాడుకుంటున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. 

 

ఇవి కూడా చదవండి

గ్రానైట్​ అక్రమ రవాణాపై సీబీఐ పూర్తిస్థాయి ఎంక్వైరీ షురూ

విశ్లేషణ: విలువలు లేనిపార్టీలు.. పట్టింపు లేని ప్రభుత్వం

సున్నిపిండి స్నానంతో కలిగే బెనిఫిట్స్ ఇవే..

విశ్లేషణ: బహుశా కేసీఆర్ ధైర్యశాలి కావొచ్చు