సాయితేజ్కి యాక్సిడెంట్ అయ్యిందనే వార్త తన కుటుంబాన్నే కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీని, అభిమానుల్ని కూడా షాక్కి గురి చేసింది. తేజ్ త్వరగా కోలుకోవాలంటూ వారంతా చేసిన ప్రార్థనలు ఫలించాయి. సాయితేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా ట్విటర్లో షేర్ చేసుకున్న చిరంజీవి.. సాయితేజ్తో కలిసి తీయించుకున్న ఈ ఫ్యామిలీ ఫొటోని పోస్ట్ చేశారు.
అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ. @IamSaiDharamTej pic.twitter.com/DZOepq88ON
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 5, 2021