- ఫ్యామిలీ ‘పంచాయితీ’.
- .ఆదిలాబాద్ జిల్లాలోని ఒక జీపీలో అత్తా కోడళ్ల పోటీ
- మరోచోట అన్నదమ్ములు
ఇంద్రవెల్లి, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో ఒకే ఫ్యామిలీ నుంచి సర్పంచ్ స్థానం కోసం పోటీపడడం చర్చనీయాంశంగా మారింది. ఓ జీపీలో ముగ్గురు సొంత అన్నదమ్ములు సర్పంచ్ పోటీకి సై అంటుండగా, మరో చోట అత్త, కోడలు పోటీ పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట గ్రామ సర్పంచ్ స్థానానికి జాదవ్ కుబేర్ సింగ్, లఖన్, అనార్ సింగ్ నామినేషన్లు దాఖలు చేశారు.
ఇందులో జాదవ్ లఖన్ గత టర్మ్లో సర్పంచ్ గా పని చేశాడు. ఇదే మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన తొడసం లక్ష్మీబాయి, ఆమె కోడలు తొడసం మహేశ్వరి సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు ఫ్యామిలీల మధ్య జీపీ ఎలక్షన్లు పంచాయితీ పెట్టాయని చర్చించుకుంటున్నారు.
