- సీడ్కోసం మహారాష్ట్ర వెళ్తున్న అన్నదాతలు
- సబ్సిడీ విత్తనాల పంపిణీ బంద్చేసి చోద్యం చూస్తున్న సర్కార్
నిజామాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం సబ్సిడీపై సోయా విత్తనాలపంపిణీ నిలిపేయడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. ఇక్కడ సీడ్ దొరకక మహారాష్ట్ర వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఆరుతడి పంటగా రైతులు ఎక్కువగా సోయానే సాగు చేస్తారు. డిమాండ్ ఉండడం, మూడు, నాలుగు నెలల్లో పంట చేతికి రావడంతో దీన్ని సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతారు. ఏడాదికి సుమారు 70 వేల ఎకరాల్లో పంట సాగవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా. ఈ ఖరీఫ్ సీజన్లో సమయానికి పెద్దవానలు పడనందున సోయా సాగు విస్తీర్ణం మరింత పెరిగే ఛాన్స్ఉంది. కానీ గవర్నమెంట్నుంచి సీడ్ సప్లయ్లేక, మార్కెట్లో సీడ్ దొరకక మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నారు. రేపు విత్తనం మొలకెత్తకుంటే ఎవరిని అడగాలో అనే ప్రశ్న రైతులకు ఎదురవుతోంది.
పొరుగు రాష్ట్రానికి పరుగు..
రెండేళ్ల కింద తెలంగాణ సర్కార్33 శాతం సబ్సిడీతో సోయా సీడ్సరఫరా చేసేది. పరిశోధనల తర్వాత అమ్మే విత్తనాలు కావడంతో రైతులు నమ్మకంతో ఉండేవారు. రైతుబంధును సాకుగా చూపి, అగ్రికల్చర్సబ్సిడీలను గవర్నమెంట్ఆపేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీడ్అవసరాల కోసం పొరుగు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. మహారాష్ట్రలోని నర్సీ, నాయగావ్, కొండల్వాడీ, ధర్మాబాద్వెళ్లి, గ్యారెంటీ లేని సీడ్కొంటున్నారు.ఎకరాకు 30 కేజీల సీడ్బస్తా సరిపోగా, అందుకోసం రూ.2,400 నుంచి రూ.3,500 వరకు ఖర్చుచేస్తున్నారు. రెండేళ్ల కింద మనరాష్ట్రంలో ఇదే సీడ్బస్తా సబ్సిడీపై రూ.1700 వరకు లభించేది. దీంతో సగటున 4, 5 ఎకరాల్లో సోయా వేసే రైతులు విత్తనాలకే అదనంగా రూ.4000 నుంచి రూ.6000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
సబ్సిడీ లేని సీడ్ ఇచ్చినా మేలే..
ఉమ్మడి జిల్లాలోని బోధన్, కోటగిరి, ఆర్మూర్, భీమ్గల్, మోర్తాడ్, రెంజల్తో పాటు మద్నూర్, జుక్కల్, గాంధారి ఏరియాల్లో సోయా సాగు అధికంగా ఉంటుంది. సాగునీటి సౌలత్తక్కువగా ఉన్న మెరక భూమిలో వర్షాధార పంటగా దీన్ని సాగు చేస్తారు. 20 రోజులకో తడి చొప్పున నీరందితే సరిపోతుంది. సబ్సిడీ లేకుండా ఇక్కడి గవర్నమెంట్ సీడ్అమ్మినా, కొనేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. సహకార సొసైటీలు మేలు రకం సీడ్ను అందుబాటులో ఉంచితే, రైతులు భరోసాగా పంట సాగు చేసుకోవచ్చు.
రూ.80 వేల సీడ్ తెచ్చిన..
గవర్నమెంట్సబ్సిడీపై సోయా సీడ్ పంపిణీ ఆపేయడం సరికాదు. నేను 20 ఎకరాల్లో సోయా సాగు చేయడానికి మహారాష్ట్ర నుంచి రూ.80 వేలు ఖర్చుపెట్టి సీడ్తెచ్చిన. మనరాష్ట్రంలోనే విత్తనాలు సరఫరా చేస్తే, పక్క రాష్ట్రానికి పోయ్యే పరిస్థితి ఉండేదికాదు. భరోసాతో పంట వేసే వాళ్లం.
అనిల్, ఖాజాపూర్, బోధన్
గవర్నమెంట్సీడ్పై నమ్మకం ఉంటుంది
విధిలేని స్థితిలో పక్క రాష్ట్రం నుంచి సీడ్ తెచ్చుకున్నం. అక్కడి వ్యాపారులు చెప్పింది విని సీడ్ తీసుకోవడమే తప్ప మాకేం తెలవదు. ఇంత ఖర్చు చేసి విత్తనాలు వేస్తే, మొలుస్తయో, లేదోనని అనుమానంగా ఉంది. గవర్నమెంట్ సీడ్సప్లయ్ చేస్తే నమ్మకంగా ఉండేవాళ్లం.
కేజీ గంగారాం, సాలూరా, బోధన్