ఓటరు లిస్ట్ ఇంటెన్సివ్ రివిజన్పై ఫోకస్

 ఓటరు లిస్ట్ ఇంటెన్సివ్ రివిజన్పై ఫోకస్

నిజామాబాద్, వెలుగు : ఓటరు లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్​రివిజన్​(సర్​)పై ఫోకస్ పెట్టి సకాలంలో పూర్తి చేస్తామని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఎస్ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు తెలిపారు. రూరల్ సెగ్మెంట్​లో ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేశామని, అర్బన్ ఇతర సెగ్మెంట్​ల్లో కూడా పూర్తి చేస్తామన్నారు. కాన్ఫరెన్స్​లో అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్​కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్​తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 68 ఫిర్యాదులు..

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్​ముగిసిన నేపథ్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పౌరుల నుంచి 68 ఫిర్యాదులు వచ్చాయి.​ అడిషనల్ కలెక్టర్​కిరణ్​కుమార్ పౌరుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.