హాలియాలో కరెంట్​కోతలతో పంటలు ఎండుతున్నయ్

హాలియాలో కరెంట్​కోతలతో పంటలు ఎండుతున్నయ్

హాలియా, వెలుగు: కరెంట్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్​ సబ్​స్టేషన్​ ఎదురుగా మిర్యాలగూడ–హాలియా ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్కారు సాగుకు 24 గంటల కరెంట్​ ఇస్తున్నామని చెబుతున్నా...  12 గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. ఇందులోనూ కోతలు పెడుతోందని, 24 గంటల కరెంట్ పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో  పోలీసులు రైతులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.