వర్షం కోసం రైతుల పూజలు

వర్షం కోసం  రైతుల పూజలు

మరికల్, వెలుగు: వర్షాలు పడతాయనే ఉద్దేశంతో చాలా మంది రైతులు చేలను చదును చేసుకొని విత్తనాలు వేసుకున్నారు. వానలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడాలని శనివారం మండలంలోని పల్లెగడ్డకు చెందిన రైతులు కృష్ణానదికి వెళ్లారు. కృష్ణా జలాలతో ఊరేగింపుగా వచ్చి గ్రామంలోని దేవతామూర్తులకు అభిషేకం చేశారు. రైతులు శ్రీరాములు, వెంకటన్న, గోపాల్, రాములు, రాజప్ప, రాయుడు, నారాయణ, శ్రీరాములు, 35 మంది భజన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.