రైతులు, వ్యవసాయ మార్కెట్ ఆధికారుల మధ్య తోపులాట

రైతులు, వ్యవసాయ మార్కెట్ ఆధికారుల మధ్య తోపులాట

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వరి రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్ కు రైతులు వరి ధాన్యాన్ని భారీ ఎత్తున తీసుకొని వచ్చారు. వడ్లను కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ ఆధికారుల పనితీరుపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వరిపై ఎందుకు గిట్టుబాటు ధర తగ్గించారంటూ మండిపడ్డారు.

ఈ ఘర్షణలో రైతులు, మార్కెట్ ఆధికారులకు మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి మధ్య ఘర్షనను ఆపేందుకు ప్రయత్నించారు. మార్కెట్ ఆధికారలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.