కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


పర్వతగిరి/ హసన్​పర్తి, వెలుగు: రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు అన్నారు. సోమవారం వరంగల్​ జిల్లా పర్వతగిరి, ఏనుగల్లు, హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం వంగపహాడ్, నాగారం గ్రామాల్లో మార్క్​ఫెడ్​ సహకారంతో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్, కుడా చైర్మన్​ వెంట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ​