
- మహారాష్ట్రలో దారుణం
నాగ్పూర్: క్షణికావేశంలో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులను గన్ తో కాల్చి తానూ కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్పూర్ లో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. పెద్దకొడుకు అక్కడికక్కడే చనిపోగా చిన్న కొడుకును నాగ్పూర్ లోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. ‘‘ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నాగ్పూర్ కు చెందిన ముల్ చంద్ ద్వివేది(50) లాక్డౌన్ ఎఫెక్టుతో బల్లార్పూర్ లో తన కుమారులతో ఉంటున్నాడు. ముల్చంద్కు తన కొడుకులు ఆకాశ్(22), పవన్(20) మధ్య మంగళవారం సాయంత్రం చిన్న గొడవ మొదలైంది. కోపంతో ఉన్న తండ్రి ముల్ చంద్ తన లైసెన్స్ గన్ తీసి ఆకాశ్, పవన్లను కాల్చాడు. తర్వాత అతను కూడా కాల్చుకున్నాడు”అని పోలీసులు వెల్లడించారు. ఆస్పత్రిలో పవన్ కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పారు.
ముల్చంద్ బల్లార్పూర్ బీజేపీ సీనియర్ నాయకుడు శివచంద్ ద్వివేది సోదరుడు అని గుర్తించారు. చనిపోయిన ఆకాశ్ కూడా బల్లార్ పూర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా.. చిన్న కొడుకు పవన్ ఐస్క్రీం పార్లర్ నడుపుతున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య గొడవకు కారణం ఏంటో నిర్ధారించలేకపోయామని పోలీసుల తెలిపారు.