ఫేస్‌బుక్‌ చాటింగ్‌ లో ఫుల్‌ సెక్యూర్‌ ఫీచర్‌

ఫేస్‌బుక్‌ చాటింగ్‌ లో ఫుల్‌ సెక్యూర్‌ ఫీచర్‌

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో వాయిస్‌, వీడియో కాల్స్‌, టెక్ట్స్‌ మెసేజ్‌లు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యే ఉంటాయి. దీంతో యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఫేస్‌బుక్‌ ఈ ఫీచర్‌ను తమ యూజర్లకు కూడా తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ యాప్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇకపై ఫేస్‌బుక్‌లో పంపించుకునే మెసేజ్ లను యూజర్, రిసీవర్‌ తప్ప మరెవరూ చూసే అవకాశం లభించదు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ త్వరలోనే ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ఫేస్‌బుక్‌ గ్రూప్‌ చాట్‌లలోనూ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న డిస్పప్పియర్‌ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌లోనూ తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో నిర్ణీత సమయం తర్వాత ఫేస్‌బుక్‌లో మీరు పంపించిన మెసేజ్‌ను అవతలి వ్యక్తికి కనిపించకుండా చేసుకోవచ్చన్నాట. ఈ ఫీచర్‌ సహాయంతో మెసేజ్‌ను 5 సెకన్ల నుంచి 24 గంటల్లోపు డిస్‌అప్పియర్‌ అయ్యేలా చేసుకోవచ్చు.