ఇటు వడ్డీ వ్యాపారం.. అటు గంజాయి బిజినెస్

ఇటు వడ్డీ వ్యాపారం.. అటు గంజాయి బిజినెస్
  • బైక్​పై వెళ్తుండగా పట్టుకున్న డీటీఎఫ్​ సిబ్బంది ..
  • 4.5 కిలోలు స్వాధీనం

బషీర్​బాగ్, వెలుగు: ఓ వడ్డీ వ్యాపారీ పార్ట్​ టైంగా గంజాయి బిజినెస్​  ప్రారంభించాడు. ఒడిశా నుంచి తెచ్చి హైదరాబాద్​లో గంజాయి విక్రయిస్తున్న అతడిని డీటీఎఫ్​ సిబ్బంది  పట్టుకున్నారు. మల్లాపూర్ కు చెందిన చెన్న రమేశ్​గౌడ్(27) వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. లక్షల్లో సంపాదన ఉన్నప్పటికీ సులువుగా మరింత లాభాలు గడించేందుకు ఆయన దృష్టి గంజాయి వైపు వెళ్లింది. కొన్ని రోజులుగా  యూపీ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్​లో విక్రయిస్తున్నాడు. 

శుక్రవారం తన రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​పై గంజాయితో వెళ్తుండగా సమాచారం అందుకున్న డీటీఎఫ్​ సీఐ సావిత్రి ఆధ్వర్యంలో సిబ్బంది నారాయణగూడ వైఎంసీఏ కూడలి వద్ద పట్టుకున్నారు. 4.5 కిలోల గంజాయి, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. రమేశ్​గౌడ్​ను రిమాండ్​కు తరలించినట్లు నారాయణగూడ ఎక్సైజ్ సీఐ కల్పన తెలిపారు.