
ఈ మధ్యకాలంలో ఫ్యాన్ వార్స్ ఎక్కువైపోయాయి. నా టీం గొప్ప అంటే.. నా టీం గొప్ప అని అభిమానులు గొడవలు పెట్టుకుంటారు. అయితే, ఇప్పటివరకు సోషల్ మీడియాకు పరిమితం అయిన ఈ ఫ్యాన్ వార్స్ ఇప్పుడు గ్రౌండ్ (స్టేడియం) వరకు వచ్చాయి. రెండు గ్రూపులుగా విడిపోయి.. చితక్కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయాయి.
శనివారం (ఏప్రిల్ 29) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ఫ్యాన్స్ శృతి మించారు. ఇరు జట్ల ఫ్యాన్స్ గొడవకు దిగారు. తమ ఫేవరెట్ టీం గెలుస్తుంది అని పందెం కాస్తూ రెండు గ్యాంగులుగా విడిపోయి కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు గ్యాంగులను విడదీసి గొడవ సర్దుమనిగేలా చేశారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గొడవకు కారణం అయిన వాళ్లను స్టేడియం నుంచి బయటికి పంపించి వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రెండు వారాల క్రితం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.