పైసల కోసం గొడవ.. మహిళ దారుణ హత్య

 పైసల కోసం గొడవ.. మహిళ దారుణ హత్య

జీడిమెట్ల, వెలుగు: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. నేపాల్​కు చెందిన కుమార్(22) సిటీకి వచ్చి బాచుపల్లి పరిధి ఇందిరా నగర్​లోని ఓ హోటల్​లో నెలరోజులుగా పనిచేస్తున్నాడు. ఆ హోటల్ వెనుకాలె రూమ్ రెంట్​కు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి కుమార్, అతడి ఫ్రెండ్ చింతల్​కు చెందిన ఓ మహిళ(45)తో మాటలు కలిపి ఆమెను ఇందిరానగర్​లోని రూమ్​కు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి ఆమెతో గొడవపడి నోటిలో బట్ట కుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత కుమార్, అతడి ఫ్రెండ్ అక్కడికి నుంచి పారిపోయారు. శుక్రవారం ఉదయం కుమార్ పనికిరాకపోవడంతో హోటల్​ఓనర్ అతడి రూమ్​కు వెళ్లి చూడగా.. మహిళ డెడ్ బాడీ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్ బాడీని హాస్పిటల్​కు తరలించారు. పైసల కోసం జరిగిన గొడవ కారణంగానే కుమార్, అతడి ఫ్రెండ్ మహిళను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.