
ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు ఇవాళ (సోమవారం) కన్నుమూశారు. దీక్షితులు ఓ సినిమా షూటింగ్ లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్ లోని నాచారం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్తుంగా దారిలోనే దీక్షితులు చనిపోయినట్లుగా డాక్లర్లు తెలిపారు. దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. మహేశ్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాలో దీక్షితులు పోషించిన పూజారి పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇంద్ర, ఠాగూర్, అతడు, వర్షం సినిమాల్లో తనదైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.