న్యూఢిల్లీ: ఈ నెలాఖరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–-22) ముగుస్తుంది కాబట్టి ఆర్థిక విషయాలకు సంబంధించిన గడువులూ ముగుస్తాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులతోపాటు ఇతరులూ పాన్-–ఆధార్ లింకింగ్ను చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేయడం వంటివి సాధ్యం కాదు. ఇందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఈలోపు చేయాల్సిన మరికొన్ని పనుల వివరాలు.
1. రివైజ్డ్ ఐటీఆర్ ఫైలింగ్: 2021–-22 ఫైనాన్షియల్ ఇయర్ కోసం రివైజ్డ్ ఐటీఆర్ ఫైలింగ్కు 31 మార్చి 2022 గడువు ఉంది. ఇప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయకుంటే వెంటనే చేయాలి. 2020–-21 ఫైనాన్షియల్ ఇయర్ కోసం రివైజ్డ్ ఐటీఆర్ని ఫైల్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2021. సంబంధిత వ్యక్తులు రివైజ్డ్ ఐటీఆర్ని ఆన్లైన్లో ఫైల్ చేసినట్లయితే, దానిని 31 మార్చి 2022లోపు మార్చవచ్చు. ఈ–-ఫైల్ చేసిన ఐటీఆర్లో ఏదైనా పొరపాటును గమనించినట్లయితే సరిచేసుకోవచ్చు.
2. పాన్–-ఆధార్ లింకింగ్: ఆధార్ కార్డ్తో పాన్ కార్డును సీడింగ్ చేయడానికి 31 మార్చి 2022 చివరి తేదీ. ఈ గడువులోపు లింకింగ్ కాకపోతే పాన్ కార్డ్ పనిచేయదు. చెల్లని పాన్ కార్డు హోల్డర్లకు సెక్షన్ 272బీ ప్రకారం రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. బ్యాంకు డిపాజిట్ వడ్డీపై పొందేవాళ్లకు అయితే టీడీఎస్ రెట్టింపు అవుతుంది.
3. బ్యాంక్ ఖాతాలకు కేవైసీ అప్డేట్: 2021 సంవత్సరం చివరిలో ఒమిక్రాన్ రావడంతో బ్యాంక్ ఖాతాల యూవర్ కస్టమర్(కేవైసీ) అప్డేట్ కోసం గడువును ఆర్బీఐ 31 డిసెంబర్ 2021 నుండి 31 మార్చి 2022 వరకు పొడిగించాల్సి వచ్చింది. బ్యాంక్ ఖాతాదారులు తమ కేవైసీ అప్డేట్ను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలి. లేకుంటే వారి బ్యాంక్ ఖాతా పనిచేయదు.
4. పన్ను ఆదా పెట్టుబడి పథకాలు: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లు వంటి ట్యాక్స్ సేవింగ్స్ స్కీముల ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ట్యాక్స్ పేయర్లు ఇలాంటి పెట్టుబడులను పరిశీలించుకొని వీలైతే ఇలాంటి స్కీముల్లో పొదుపును పెంచుకోవాలి. పన్ను ఆదా చేసే పెట్టుబడికి ఇంకా అవకాశం ఉన్న వాళ్లు ఈ నెలాఖరులోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.