గూగుల్​కు ఫైన్​..  సమర్థించిన ఎన్సీలాట్

గూగుల్​కు ఫైన్​..  సమర్థించిన ఎన్సీలాట్

న్యూఢిల్లీ: అండ్రాయిడ్‌​ మొబైల్​ ఎకోసిస్టమ్​లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని పేర్కొంటూ కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) రూ.1,337 కోట్ల జరిమానా విధించడాన్ని నేషనల్​ కంపెనీ లా అప్పిలేట్​ ట్రిబ్యునల్​ (ఎన్సీల్యాట్​) సమర్థించింది. ఈ మొత్తాన్ని నెలలోపు డిపాజిట్​ చేయాలని టూ మెంబర్​ బెంచ్​ ఆదేశించింది. సీసీఐ ఆదేశాలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్న గూగుల్​ వాదనను తోసిపుచ్చింది. అయితే సీసీఐ ఇచ్చిన 10 ఆదేశాల్లో కొన్నింటిని మార్చింది. నాలుగు రూల్స్​ను గూగుల్​కు అనుకూలంగా సవరించింది. ఇక నుంచి గూగుల్​ తన ప్లేస్టోర్​లో థర్డ్​పార్టీ యాప్​ స్టోర్స్​ను హోస్ట్​ చేయాలి.