భద్రాచలం పాత ఎంపీడీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం

భద్రాచలం పాత ఎంపీడీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం
  • రికార్డు రూంలో ఫైళ్లు, కంప్యూటర్లు దగ్ధం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం పాత ఎంపీడీవో ఆఫీసులో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి రికార్డు రూం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్​సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే రికార్డు రూంలోని ఫైళ్లు, కంప్యూటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

ఎంపీడీవో ఆఫీసును ఆళ్లపల్లి మండలానికి మార్చాక స్పెషల్ ఆఫీసర్​ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దళితబంధు, బీసీ బంధు, పెన్షన్లు ఇతర స్కీంలను జడ్పీ డిప్యూటీ సీఈవో నాగలక్ష్మీ స్పెషల్ ఆఫీసర్​గా పర్యవేక్షిస్తున్నారు. ఆ రికార్డులు మొత్తం ఇందులోనే ఉన్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సీఐ నాగరాజురెడ్డి, ఫైర్​ఆఫీసర్​ శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్​ నాగలక్ష్మి పాత ఎంపీడీవో ఆఫీసుకు వచ్చారు. ప్రమాద వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.