యూపీలో భారీ అగ్ని ప్రమాదం.. తొమ్మిది మందికి గాయాలు

యూపీలో భారీ అగ్ని ప్రమాదం.. తొమ్మిది మందికి గాయాలు

యూపీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధుర శివారు గోపాల్ బాగ్ లోని బాణసంచా దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.  దుకాణంలోని క్రాకర్స్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి పక్కనున్న మరో ఆరు బాణసంచా దుకాణాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజ్లతో మంటలను అదుపు చేశారు.  గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షాట్ షర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.