హైదరాబాద్ అపార్ట్ మెంట్ లో దసరా పూజ.. దీపం పడి చెలరేగిన మంటలు

హైదరాబాద్ అపార్ట్ మెంట్ లో దసరా పూజ.. దీపం పడి చెలరేగిన మంటలు

దసరా పండుగ.. ఇంట్లో అందరూ హ్యాపీగా.. పూజ చేస్తున్నారు. ఈ సమయంలో దీపం కింద పడి.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కళ్ల ముందే.. నిమిషాల్లోనూ.. అపార్ట్ మెంట్ లోని ఆ ఫ్లాట్ మొత్తానికి మంటలు వ్యాపించాయి. అక్టోబర్ 23వ తేదీ హైదరాబాద్ సిటీ చైతన్యపురి కాలనీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

అపార్ట్ మెంట్ నాలుగో ఫ్లోర్ లోని ఆర్.ప్రభాకరరావు అనే వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. దసరా పర్వదినాన్ని పురష్కరించుకుని.. ఇంట్లో పూజ చేస్తున్నారు. అమ్మవారికి దీపాలు వెలిగించారు. ఇందులోని ఓ దీపం కింద పడింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. దేవుడి గదితోపాటు వంట గది, హాలు మొత్తం మంటలు వ్యాప్తించాయి. వెంటనే అపార్ట్ మెంట్ వాసులు.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు.. అపార్ట్ మెంట్ వాసులు అందరూ కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మిగతా ఫ్లాట్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తగా తీసుకున్నారు.

ఫైర్ సిబ్బంది వచ్చి మొత్తం మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అపార్ట్ మెంట్ లో మంటలు రావటాన్ని చూసి.. చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురయ్యారు. పండుగ పూట ఏంటీ ప్రమాదం అని ఆందోళన చెందారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫ్లాట్ లోని ప్రభాకరరావు కుటుంబ సభ్యులు సైతం సురక్షితంగా ఉన్నారు.