64మెగా పిక్సెల్ కెమెరాతో తొలి 5జీ స్మార్ట్ ఫోన్‌‌

64మెగా పిక్సెల్ కెమెరాతో తొలి 5జీ స్మార్ట్ ఫోన్‌‌

దేశంలోకి తొలి 5జీ స్మార్ట్‌‌ఫోన్‌‌ రాబోతుంది. ‘వివో’ సంస్థ ‘ఐక్యూ’ అనే కో బ్రాండ్‌‌లో స్మార్ట్‌‌ఫోన్స్‌‌ను రిలీజ్‌‌ చేయబోతుంది. దీనిలో మొదటగా ‘ఐక్యూ 3’ అనే స్మార్ట్‌‌ఫోన్‌‌ ఈ నెల 25న విడుదలవుతుంది. ఇది దేశంలో రిలీజ్‌‌ కానున్న తొలి 5జీ స్మార్ట్‌‌ఫోన్‌‌. అలాగే స్నాప్‌‌డ్రాగన్‌‌ 865 ప్రాసెసర్‌‌‌‌తో రాబోతున్న ఫస్ట్‌‌ ఫోన్‌‌ కూడా ఇదే. 6.4 అంగుళాల ఫుల్‌‌ హెచ్‌‌డి స్క్రీన్‌‌, 12జీబీ/256జీబీ, ఆండ్రాయిడ్‌‌ 10, క్వాడ్‌‌ కెమెరా (64 ఎంపీ ప్రైమరీ+13 ఎంపీ అల్ట్రా వైడ్‌‌ + 13 ఎంపీ టెలిఫొటో + 2 ఎంపీ డెప్త్‌‌ సెన్సర్‌‌‌‌), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,370 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ వంటి ఫీచర్స్‌‌ ఉన్నాయి. 25న మధ్యాహ్నం ఫ్లిప్‌‌కార్ట్‌‌లో సేల్‌‌కు అందుబాటులో ఉంటుంది.