శ్రీనగర్: అమర్ నాథ్ ఫస్ట్ బ్యాచ్ యాత్రికులు శుక్రవారం కాశ్మీర్ లోయకు చేరుకున్నారు. శ్రీనగర్ కు చేరుకున్న 4,603 మంది యాత్రికులకు పోలీసులు, అధికారులు, స్థానిక పౌరులు, వ్యాపారులు స్వాగతం పలికారు. అనంత్ నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నన్వాన్ – పహల్ గామ్ మార్గంలో, అలాగే గందేర్బాల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గంలో శనివారం ఉదయం యాత్ర ప్రారంభం కానుంది.
శుక్రవారం జమ్మూలోని భగవతి నగర్లో యాత్రి నివాస్ బేస్ క్యాంప్ వద్ద జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) మనోజ్ సిన్హా జెండా ఊపి అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు ‘భం భం భోలే, హర్ హర్ మహాదేవ్’ అంటూ నినాదాలు చేశారు. ఎల్జీ సిన్హా మాట్లాడుతూ ప్రతిఒక్కరినీ శాంతి, సుఖసంతోషాలతో అమర్ నాథ్ దీవించాలని ఆకాంక్షించారు. యాత్రికుల జర్నీ సేఫ్గా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
