
భద్రాచలం, వెలుగు : సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం కల్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గురువారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తొలిసారిగా ల్యాప్రోస్కోపిక్ ద్వారా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజరకు చెందిన రమణ అనే పేషెంట్కు గాల్బ్లాడర్(పిత్తాశయం)లో ఉన్న రాళ్లను ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసి తొలగించారు.
మారుమూల ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఈ తరహా అధునాతన వైద్యం అందించడం పట్ల పేషెంట్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ వెంకట్ తదితరులు ఈ సర్జరీని నిర్వహించారు.