ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

దహెగాం, వెలుగు: ఆన్​లైన్​ బెట్టింగ్​గ్యాంగ్​లోని ఐదుగురిని అరెస్ట్​చేసి రూ.65,270 స్వాధీనం చేసుకున్నట్టు దహెగాం సీఐ రాణాప్రతాప్​ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా దహెగాం మండలం ఐనం గ్రామంలో అక్రమంగా ఆన్‌‌‌‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో జిల్లా టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పెరుగు వినోద్,​ గోమాస హరిదాస్, ​జుమ్మిడి వసంత్, ​కొండగుర్ల నాగేందర్,​ దుర్గం వెంకటేశ్ ను అరెస్ట్ చేశారు. 

నిందితుల వద్ద నగదు తోపాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 1 –100 వరకు టోకెన్లను ఉపయోగించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో లైవ్ వీడియోలు పోస్ట్ చేస్తూ, టోకెన్లకు భారీగా ప్రైజ్ మనీ వస్తుందని ప్రజలను నమ్మిస్తున్నారు. ​ప్రతి టోకెన్‌‌‌‌ సుమారు రూ.1000 చొప్పున అమ్ముతున్నారు. సీఐ రాణా ప్రతాప్‌‌‌‌తో పాటు ఎస్ఐ రాజు కందూరి, పోలీసు సిబ్బంది మహ్మద్, విజయ్, రమేశ్, శేఖర్ ఉన్నారు.