- ఐదుగురు నిందితులు అరెస్ట్
కొండపాక, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట త్రీ టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమికి జక్కుల రాజు, హరేందర్, దేవాసి, సోలంకి, దానారం అనే వ్యక్తులు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు సృష్టించారు.
2022లో ఆ భూమిని ఎడ్ల జ్యోతి–శ్రీనివాసరెడ్డి దంపతులకు రూ.7 లక్షలకు విక్రయించారు. అనంతరం భూమిపై వివాదం సృష్టించి, బాధితులను బెదిరించి అదనంగా రూ.40 లక్షలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
