ఆటోను ఢీకొన్న లారీ.. ఐదుగురు మృతి

ఆటోను ఢీకొన్న లారీ.. ఐదుగురు మృతి

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఎన్‎హెచ్ 44 పామిడి దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులది గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన కూలీలు గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.