
పెబ్బేరు, వెలుగు: అతివేగం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న 5 ఇసుక ట్రాక్టర్లను గురువారం పెబ్బేరు ఎంవీఐ వాసదేవరావు పట్టుకున్నారు. మాలపల్లె, పెబ్బేరు శివార్లలో వెహికిల్స్ చెకింగ్చేస్తుండగా అర్హత లేని యువకులు అతివేగంగా ఇసుక ట్రాక్టర్లను నడుపుతుండటంతో వారిని ఆపి ఎంవీఐ ఆఫీసుకు తరలించారు. కేసు నమోదు చేసి,5 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎంవీఐ తెలిపారు.