హైదరాబాద్, వెలుగు:ఈ–కామర్స్ ప్లాట్ఫారమ్ ఫ్లిప్కార్ట్ హైదరాబాద్లో మినిట్స్సేవలను మొదలుపెట్టింది. దీంతో పది నిమిషాల్లోనే ఆర్డర్లను డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం హైదరాబాద్లోని నిజాంపేట, వనస్థలిపురం వంటి ముఖ్య ప్రాంతాల్లో మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎంఎఫ్సీలు) ప్రారంభించింది.
మినిట్స్ద్వారా ప్యాకేజ్డ్ ఫుడ్, పర్సనల్ కేర్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, రోజువారీ నిత్యావసరాలను ఆర్డర్ చేయవచ్చు. అమ్మమాస్, సిద్దిపేట, కోథాస్, ఫ్రీడమ్ ఆయిల్ వంటి స్థానిక బ్రాండ్ల ఉత్పత్తులను అందిస్తామని ప్రకటించింది. మినిట్స్ వల్ల హైదరాబాద్నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని ఫ్లిప్కార్ట్ తెలియజేసింది.
