రైతులకు ట్రైనింగ్ ఇవ్వనున్న ఫ్లిప్​కార్ట్

రైతులకు ట్రైనింగ్ ఇవ్వనున్న ఫ్లిప్​కార్ట్

హైదరాబాద్, వెలుగు: రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్‌‌పిఓలు), సెల్ఫ్​హెల్ప్ ​గ్రూపులకు (ఎస్​హెచ్​జీ) మార్కెట్లో అవకాశాలను కల్పించడానికి ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)తో శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై ఫ్లిప్​కార్ట్​ సంతకం చేసింది. 
ఫ్లిప్‌‌కార్ట్ & ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్​) - ఐఐఎంఆర్​ మధ్య ఎంఓయూ డాక్యుమెంట్ల మార్పిడి జరిగింది. ఫలితంగా ఫ్లిప్‌‌కార్ట్​లోని 40 కోట్ల మందికిపైగా కస్టమర్లకు స్థానిక వ్యవసాయ సంఘాల,  ఎస్​హెచ్​జీల ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయి.
 ఐకార్–​-ఐఐఎంఆర్​తో​ ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఫ్లిప్​కార్ట్ ​రైతులకు ట్రైనింగ్​ ఇస్తుంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఎఫ్​పీఓ ఎకోసిస్టమ్​లో భాగం కావడానికి అవసరమైన నాణ్యత, ధరలు,  లైసెన్సుల గురించి వారికి అవగాహన కల్పిస్తుంది.