చుట్టూ వరద.. 16 గంటలు చెట్టుపైనే!

చుట్టూ వరద.. 16 గంటలు చెట్టుపైనే!

చుట్టూ వరద.. బయటకు వెళ్లలేని పరిస్థితి. చెట్టుకొమ్మ ఒక్కటే దిక్కైంది. 16 గంటల పాటు దాన్ని పట్టుకొని అలానే ఉండిపోయాడు ఓ వ్యక్తి. విషయం తెలుసుకున్న ఇండియన్​ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్ ) రంగంలోకి దిగి ఆ వ్యక్తిని కాపాడింది. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో జరిగింది. ఇక్కడి ఖూటఘాట్ డ్యామ్ కు ఆదివారం సాయంత్రం జితేందర్ కశ్యప్ అనే వ్యక్తి స్నానానికి వచ్చాడు. అదే టైంలో డ్యామ్ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో అందులోనుంచి బయటకు రాలేకపోయాడు. అక్కడి బండరాళ్లను, చెట్టుకొమ్మను పట్టుకొని రాత్రంతా అలానే ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున ఐఏఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ తో వచ్చి.. కిందికి తాడును వదిలి జితేందర్ కశ్యప్ ను రక్షించింది.