
- 22 గేట్లు ఎత్తి 54,284 క్యూసెక్యుల నీటి విడుదల
భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది. తాలిపేరు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్లోకి నీరు వచ్చి చేరుతోంది. శనివారం ప్రాజెక్టు 22 గేట్లను ఎత్తి 54,284 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఇంజినీర్లు అలర్ట్ప్రకటించారు. ప్రాజెక్టుకు దిగువన నదిలో చేపల వేటను నిషేధించారు. నాటు పడవలల్లో ప్రయాణాలను నిలిపేశారు.