న్యూఢిల్లీ : ఆన్లైన్ బాట పట్టేందుకు చిన్న వ్యాపారాలకు రూ. 1,873 కోట్ల సాయాన్ని అమెజాన్ ప్రకటించింది. అగ్రిటెక్, హెల్త్టెక్ రంగాలలో ఇనొవేషన్కూ డబ్బు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఏ ఎకానమీకైనా చిన్న వ్యాపారాలు చాలా ముఖ్యమైనవి. ఇండియాలోనూ ఇదే నిజం. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారాల డెవలప్మెంట్కు మేం చొరవ తీసుకుంటామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సీఈఓ ఆండ్రూ జాసీ చెప్పారు. ఇందుకోసమే కొత్తగా ఈ రూ. 1,873 కోట్ల అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెజాన్ సంభవ్ మీట్ సందర్భంగా ఈ వివరాలు ఆయన చెప్పారు. కొత్త ఐడియాలు కార్యరూపంలోకి రావడానికి, విజనరీ ఎంట్రప్రెనూర్లను తేవడానికి ఈ ఫండ్ సాయపడుతుందని అమెజాన్ ఇండియా గ్లోబల్ ఎస్వీపీ అమిత్ అగర్వాల్ అన్నారు. ఎస్ఎంఈ డిజిటైజేషన్, రైతుల ప్రొడక్టివిటీ పెంచే అగ్రిటెక్ ఇనొవేషన్స్, క్వాలిటీ హెల్త్కేర్ అందించే హెల్త్టెక్ రంగాలకు ఫండ్ నుంచి అమెజాన్ నిధులు ఇస్తుందని చెప్పారు.
